ముంబైలో వలస కూలీల ఆందోళన.

లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడిగిస్తున్నట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ప్రకటించడంతో వలస కూలీలు, కార్మికుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. పనుల్లేక, సొంతూళ్లకు మార్గం లేక నానా అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ముంబైలోని వలస కూలీలు వేల సంఖ్యలో బాంద్రా రైల్వే స్టేషన్ ముందు సోమవారం సాయంత్రం గుమికూడి ఆందోళనలు చేపట్టారు. తమను సొంతూళ్లకు తిరిగి పంపాలని పట్టుబట్టారు. అయితే, కూలీలు పెద్ద సంఖ్యలో రావడానికి తప్పుడు ప్రచారమే కారణమని, ఇదంతా ఓ మరాఠీ న్యూస్ ఛానెల్ కరస్పాండెంట్ వల్లే జరిగిందని పోలీసులు గుర్తించారు. ఉస్మానాబాద్‌లోని మరాఠా న్యూస్ ఛానెల్ కరస్పాండెంట్‌గా పనిచేస్తున్న రాహుల్ కులకర్ణిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదుచేశారు.